హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామ మందిరం కానుకల చోరీపై సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి టీ శ్రీనివాసరావు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
దేవాలయంలో దోపిడీకి బీజేపీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కుంభకోణం బయట పడినా కేంద్రం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. హిందుత్వం పేరుచెప్పి ఆలయ సంపదను దోపిడీ చేశారని తెలిపారు.