హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి సంబంధించిన ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తం 26 మందిపై ఐసీపీ 341, 147, 148, 353, 332, 509 రెడ్విత్ 149 సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సోమవారం బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.
బీజేపీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, అరెస్టు చేసి రిమాండ్కు పంపే అవకాశం ఉన్నది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ నేతలను అరెస్టు చేయలేదని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు చెందిన ఓ పోలీస్ అధికారి తెలిపారు.