జనగామ : జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహ మరో ఇద్దరు మృతి చెందారు. జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారి పై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీ కొట్టి బోల్తా పడింది. డీసీఎం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా ఘటన జరిగింది.
ఈఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఆరు ఏళ్ల పాప మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జనగామ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఇంకా ఎవరనేది తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.