హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. కారులో మంటలు చెలరేగడంతో ముందుభాగంలో ఉన్న ఇంజిన్ పూర్తిగా కాలిపోయింది. కారు వరంగల్కు చెందిన వంశీకృష్ణ పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ స్థాయిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.