నల్లగొండ, మార్చి 23: వారంతా పేద విద్యార్థులు. సర్కారు కొలువుల సాధనే లక్ష్యంగా గురిపెట్టి చదువుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారం పెను సంచలనం సృష్టించినా.. దానిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నా.. ఉద్యోగార్థులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ఆ వ్యవహారం తమకు అనవసరమైన అంశమని, దాని గురించి ఆలోచిస్తే సమయమం తా వృథా అవుతుందని భావించి శిక్షణపైనే పూర్తి ఏకాగ్రత నిలుపుతున్నారు. పట్టుదలతో చదువుతున్న పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రైవేట్లో కోచింగ్ తీసుకోలేని వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. వారికి స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2013లో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్, 2015లో నల్లగొండలో, 2019లో సూర్యాపేటలో ఎస్సీ స్టడీ సర్కిళ్లను నెలకొల్పింది.
భువనగిరి జిల్లా కేంద్రంలోనూ బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు కొనసాగుతున్నాయి. వీటిలో నిపుణులైన వారితో శిక్షణ ఇప్పిస్తున్నది. ఇప్పటి వరకు 4,500 మందికి పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వగా 370 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరికొంత మంది స్టడీ సర్కిళ్లలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా ప్రైవేటు ఉద్యోగం పొందారు. ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ప్రభుత్వం ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నది. బీసీ స్టడీ సర్కిళ్లలో నెలవారీ ైస్టెఫండ్తోపాటు టీ, స్నాక్స్ అందజేస్తున్నది. అన్ని స్టడీ సర్కిళ్లలో ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో అభ్యర్థులు స్టడీ సర్కిళ్లను, ల్రైబరీలనూ ఉపయోగించుకుంటున్నారు.