హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్కు సమర్పించినట్టు ఆడిట్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ఆర్థిక స్థితి, పద్దులు, బడ్జెట్ ప్రక్రియలకు సంబంధించి ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనతో కూడిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన ఈ నివేదికను శాసనభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సమర్పించినట్టు పేర్కొన్నది.