హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథ కం అమలు, శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, వినాయక నిమజ్జనం తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్రమంత్రి మండలి గు రువారం సమావేశం కానున్నది. మ ధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశం జరుగనున్నది. ఇప్పటికే పైలట్ నియోజకవర్గంగా ఎంపిక చేసి న హుజూరాబాద్తోపాటు, యా దాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళితుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమయ్యాయి. ఈ నిధులతో దళితుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిసింది. ఈ నెల 25వ తేదీలోపు శాసనసభ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే యో చనలో ప్రభుత్వం ఉన్నది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలను చర్చకు పెట్టాలి? అనే అంశాలపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్ జలాల్లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తే ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా విగ్రహాలను హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేస్తామంటూ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమం సాఫీ గా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్లో చర్చించనున్నది. వీటితోపాటు, సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన వినతులు, కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల్లో కేంద్రం వైఖరి.. రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహం, ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్తు బకాయిల సమస్య, ధరణిలో అమలులో వస్తున్న ఫీడ్బ్యాక్, 111 జీవోపై హైకోర్టులో వాజ్యం తదితర అంశాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.