మెదక్ : మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్కు చెందిన రాచుపల్లి బ్రహ్మచారి (37) దారుణ హత్యకు గురయ్యాడు.
అతడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపారు. ఘటన స్థలంలో మద్యం సీసా, పక్కన రెండు బండ రాళ్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న మెదక్ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.