మెదక్ : మెదక్(Medak) జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విచారకర సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత రెండు సంవత్సరాల నుంచి భూమికి సంబంధించిన గొడవలు(Land dispute) జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉపసర్పంచ్ మున్రాతి ఆంజనేయులును తన అన్న సత్యనారాయణ చంపాడు అంటూ బంధువులు గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న రామాయంపేట సీఐ లక్ష్మీబాబు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.