హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తు న్న 1336 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించినందుకు సీఎం కేసీఆర్కు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాంబాబుతో పా టు హెచ్1 యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సాయిరెడ్డి, సుదర్శన్ మాట్లాడారు. 20 ఏండ్లు గా కాంట్రాక్టు ఉద్యోగుల కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబాలు కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరాల రామకృష్ణ, రాజశేఖర్, మచ్చగిరి, భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, కోండ్ల శ్రీనివాస్, శుభకరణ్, కృష్ణమూర్తి, వెంగళరావు జగదీశ్, కిరణ్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.