హైదరాబాద్ : మైనర్ బాలికపై అత్యాచారం చేసి పోక్సో (POCSO) కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వీ ( BRSV ) నాయకులు ఆదివారం డీజీపీ ఆఫీస్ ( DGP Office ) ను ముట్టడించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) మాట్లాడుతూ బండి భగీరథపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఉల్టా మైనర్ బాలిక కుటుంబ సభ్యులను వేధించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని, బాధితురాలికి సరైన న్యాయం చేసి రక్షణ కల్పించాలని కోరారు.
బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి కొంచెమైనా సిగ్గుండాలని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు.