KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం 2 గంటలకకు నాగర్కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు.