KTR | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేషన్ కార్డు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని నాలుగు పథకాలను అమలు చేస్తామని భట్టి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా అని నిలదీశారు.
మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా ? మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా ? మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా ? మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా అని భట్టి విక్రమార్కను కేటీఆర్ ప్రశ్నించారు. నాడు “అందరికీ అన్నీ..” అని.. నేడు “కొందరికే కొన్ని..” పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు.. రాష్ట్రంలోని ప్రతి మండలం.. ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. “వన్ ఇయర్” తరువాత “వన్ విలేజ్” అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అని మండిపడ్డారు.
భట్టి గారు…
మండలానికి ఒక గ్రామంలోనే
మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ?మండలానికి ఒక గ్రామంలోనే
మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా ?మండలానికి ఒక గ్రామంలోనే
మీ ఎన్నికల ప్రచారం చేశారా ?మండలానికి ఒక గ్రామంలోనే
ప్రజలను ఓట్లేయమని అడిగారా ?మండలానికి ఒక గ్రామంలోనే
ఓట్లు వేస్తే… pic.twitter.com/uqsYX38oYL— KTR (@KTRBRS) January 26, 2025
ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు.. ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ ఏరు దాటక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తరువాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరని కేటీఆర్ అన్నారు. పథకాలు రాని గ్రామాల్లో.. రేపటి నుంచి ప్రజా రణరంగమే అని హెచ్చరించారు. గుర్తుపెట్టుకోవాలని భట్టి విక్రమార్కకు వార్నింగ్ ఇచ్చారు.