KTR | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నదట! అలావుంది రేవంత్ రెడ్డి వ్యవహారం అని కేటీఆర్ విమర్శించారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే.. ఒక బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్ఠి పెట్టేవాడివి. ఎన్నికలు, ఢిల్లీ టూర్ల అంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు.. ఆ వీడియో చూడు.. కొంచం అయినా విషయ పరిజ్ఞానం వస్తుంది! అని రేవంత్కు కేటీఆర్ సూచించారు.
అయినా పనులు ఆగిపోవడం వల్ల బేరింగులు పని చేయడం లేదు అని అనడం ఏంటి? అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే ఏమన్నా చేశారా? గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని మేము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి.. ఈ పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్ చాట్లు దేనికి?? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నాదట!
అలావుంది రేవంత్ రెడ్డి వ్యవహారం
SLBC ప్రమాదం జరిగితే….ఒక బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్ఠి పెట్టేవాడివి…
ఎన్నికలు, ఢిల్లీ టూర్ల అంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా?
SLBC ఒక డిజైన్… pic.twitter.com/PFD4AxwOos
— KTR (@KTRBRS) February 26, 2025