హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇటువంటి బృహత్తర విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినందుకు గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో మూడు ప్యాకేజీల్లో రూ.3,866.41 కోట్లతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీలు విడతలవారీగా అందుబాటులోకి వస్తుండగా.. నిర్మాణ పనులను మెగా ఇంజినీరింగ్ కంపెనీ గురువారం ‘ఎక్స్'(ట్విట్టర్) వేదికగా షేర్ చేయగా.. దీనిపై కేటీఆర్ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి దిశగా చేపట్టిన ప్రయాణంలో ఇదో గొప్ప భాగమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.