KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో రైతన్నలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సాగుకు సరిపడా విద్యుత్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో అన్నదాతలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ముంచుకొస్తున్న ముప్పును ముందే హెచ్చరించినా.. ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదు అని కేటీఆర్ విమర్శించారు. కల్వతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా విషం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదు. కళ్ల ముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఓవైపు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక అన్నదాత అల్లాడుతున్న సమయంలో గోరి చుట్టు మీద రోకలి పోటులా పంటలు ఎండటంతో రైతు బతుకు ఆగమైంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. ఎండిన ప్రతి ఎకరానికి వెంటనే రూ.25 వేల నష్ట పరిహారం ప్రకటించి వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే రైతులతో కలిసి కాంగ్రెస్ సర్కారు భరతం పడతాం అని కేటీఆర్ హెచ్చరించారు. జై కిసాన్.. జై తెలంగాణ.. అని కేటీఆర్ నినదించారు.
ముంచుకొస్తున్న ముప్పును ముందే హెచ్చరించినా.. ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదు
కల్వతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా విషం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదు
కళ్లముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక… pic.twitter.com/EUXrVnYULV
— KTR (@KTRBRS) March 18, 2025