KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా.. ఓటుతోనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్ను పట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యబూట్లో మొరిగే కుక్కల దాకా అందరికీ సమాధానం చెప్పాలంటే మన గెలుపే సమాధానం అవుతది. పదేండ్లు ప్రజల మద్దతుతో పని చేసిన నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, శూన్యంలో నుంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్ను పట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే ఉంది. ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేయాలి. కాంగ్రెసోళ్ల మాటలు వింటుంటే రక్తం మరుగుతది. హైదరాబాద్లో తన్నినట్లే మరోసారి మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో జాడిచ్చి తన్నాలి. దాంతో వారి నోరు మూత పడవాలి. అడ్డమైన కారు కూతలు మూతపడాలంటే కారు వంద కిలోమీటర్ల వేగంతో ఉరకాలి. లక్ష్మారెడ్డి గెలిచి తీరాలి అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా..? రాహుల్ మనిషా..? మోదీ మనిషా..? అర్థం కావడం లేదు. నరేంద్ర మోదీ దొంగ అని రాహుల్ అంటే, రేవంతేమో మోదీ బడే బాయ్ అంటడు. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాండ్ అంటుంటే.. అదానీ హమారే ఫ్రెండ్ అంటుండు రేవంత్. గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ అంటుంటే.. రేవంత్ రెడ్డేమో తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటుండు. మైనార్టీల కొపంలు పుచ్చుకుని, బుల్డోజర్లతో ఇండ్లు కూలగొట్టి, దిక్కుమాలిన పనులు చేసి హిందూ – ముస్లిం ఫీలింగ్ తెస్తావా..? లిక్కం స్కాం లేదు.. మన్ను లేదు.. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడం తప్పు అని రాహుల్ అంటడు.. రేవంత్ రెడ్డేమో కవితను అరెస్టు చేయడం కరెక్ట్ అని అంటడు. అసలు రేవంత్ ఎవరి మనషి..?ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఒక్క ఓటు రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా అది అల్టిమేట్గానే బీజేపీకి లాభం అయితది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి జంప్ అవుతాడు. ఈ మాట అన్నప్పుడు రేవంత్ ఖండించడం లేదు. ఆయన మొదట ఏబీవీపీలో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్, అక్కడ్నుంచి టీడీపీ, కాంగ్రెస్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ మాతృసంస్థ బీజేపీలోకే పోతడు. పచ్చి అవకాశవాది రేవంత్ రెడ్డి.. ఆయనకు మరో ఎజెండా లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.