KTR | హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కర్ణాటక సీఎంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వలనే మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డిసెంబర్ 9వ తేదీ నాటికి నెరవేరుస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయింది? రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమైంది? రూ. 4 వేల ఆసరా పెన్షన్ ఏమైంది..? రూ. 500కే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయింది..? ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామన్నారు కదా ఆ మాట ఏమైంది..? మొదటి కేబినెట్లోనే మెగా డీఎస్సీ పైన ప్రకటన ఉంటుందని చెప్పిన హామీపై చర్యలు ఏవి..? మొదటి కేబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పిన మాట ఏది..? ఇలా మీరు ఇచ్చిన హామీలు నకిలీవా..? లేదా ఈ మాటలు చెప్పిన మీ కాంగ్రెస్ నేతలు నకిలీలా చెప్పాలి అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరి మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన మీ పార్టీ పరిస్థితి వివరించగలరా అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కేటీఆర్ ప్రశ్నించారు.
Dear Sri Siddaramaiah Garu,
We’ve lost the election because your party had shamelessly misled the people of Telangana with Fake promises
Dec 9th, 2023 has passed, but where is the:
👉 Rythu Bharosa promised to farmers, tenant farmers and farm labourers
👉 Rs 2 Lakhs Farm… https://t.co/CACSR7ai28 pic.twitter.com/pZGMdikfN4
— KTR (@KTRBRS) December 19, 2023