హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉప ఎన్నికలకు భయపడే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం లేదని ధ్వజమెత్తారు. స్పీకర్ నిర్ణయంపై స్పందిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపైనా రాహుల్గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం ఫొటోలకు పోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే సరిపోదని ఎద్దేవాచేశారు. ‘సొంత తండ్రి రాజీవ్గాంధీ తెచ్చిన ఫిరాయింపు నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్గాంధీ చరిత్రలో మిగిలిపోతారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయిం పు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్గాంధీ, కాంగ్రెస్ పార్టీ రెండు నాలల ధోరణికి నిదర్శనం’ అని దుయ్యబట్టారు.
ఉప ఎన్నికల భయంతోనే..
రేవంత్రెడ్డి రెండేండ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటేనే భయపడుతున్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ, వెనుకడుగు వేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా, కేవలం ఇకడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోలేదని మండిపడ్డారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. సాంకేతికతను అడ్డుపెట్టుకుని వారిని తాతాలికంగా కాపాడినా ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు.