KTR | కరీంనగర్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే కరీంనగర్ నుంచి ఆనాడు ఆంధ్రా పాలన మీద సింహా గర్జన చేశారని గుర్తు చేశారు. నేడు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలనపై కదన భేరీ మోగించనున్నారని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ నెల 12వ తేదీన కేసీఆర్ తిరిగి జంగ్ సైరన్ ఊదడానికి, కదన భేరీ మోగించడానికి మన కరీంనగర్కే వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించిన విజయవంతం అవుతుందని నమ్మకం. ఆ రోజు ఆంధ్రా పాలన మీద సింహాంలాగా కేసీఆర్ గర్జించారు. ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద కదన భేరీ మోగించడానికి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2001, మే 17న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో సింహా గర్జన నిర్వహించుకున్నాం. ఇప్పుడు కూడా అదే మైదానం నుంచి కదన భేరీ మోగించబోతున్నామని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి పోస్టర్లు రీలిజ్ చేసుకున్నాం. ఈ పోస్టర్లు గ్రామాలకు, పట్టణాలకు వెళ్లాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్ధతుదారులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి.
ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే కేసీఆర్ ప్రారంభించబోతున్నారు అని కేటీఆర్ తెలిపారు.