KCR | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కు అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) వరించింది. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కేంద్రం భారత రత్న పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. దీంతో పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పీవీకి భారత రత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ను గౌరవించి పురస్కారం ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ కి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ… pic.twitter.com/sKZVLWDd7G
— BRS Party (@BRSparty) February 9, 2024
Also Read..
Bharat Ratna: పీవీ నర్సింహారావు, చరణ్సింగ్, స్వామినాథన్లకు భారత రత్న..
PM Modi | చరణ్సింగ్కు ‘భారతరత్న’ మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టం: ప్రధాని మోదీ