MLC Kavitha | రాష్ట్రవ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.