హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ(88) కన్నుమూశారు. కొంతకాలంగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం 4 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 9లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆండాళమ్మ మరణవార్త తెలియగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దామోదర్ రావుకు ఫోన్ చేసి సంతాపం ప్రకటించారు.
రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీ సంతోశ్కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రావుల శ్రీధర్రెడ్డి, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాశ్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస రెడ్డి, నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్ రావు, ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస్, డీజీఎం సర్క్యులేషన్ రాంరెడ్డి తదితరులు ఆండాళమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పెద్దసంఖ్యలో వచ్చిన బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఆండాళమ్మ అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో నిర్వహించారు.