హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): వైసీపీ దురాగతాలను ఎండగతామని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన నేతలు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఏపీ నాయకుడు తలారి సురేశ్ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పీ సత్యనారాయణ, గుంటూరు నేతలు షేక్ బాషా, షేక్ ఖాజావలి తదితరులు బీఆర్ఎస్లో చేరారు.