హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగులయ్యకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థికసాయం అందించారు. బీఆర్ఎస్ సర్కారు అందించిన కళాకారుల పింఛన్ను కాంగ్రెస్ సర్కారు ఆపివేయడంతో ఆయన కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న కేటీఆర్.. మొగులయ్యను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం మొగులయ్యను కలిసి ఆర్థికసాయం అందజేశారు.
మొగులయ్యకు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పింఛన్తోపాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేటీఆర్ సాయానికి మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మొగులయ్యను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.