జనగామ : ముఠా తగాదాలు వదిలి కాంగ్రెస్(Congress) పార్టీ ప్రతిపక్షాలను కలుపుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari )అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించినందుకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజలకు కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ప్రభుత్వ రాబడికి ఎక్కడ పొంతన కుదరడం లేదు. కేసీఆర్ నేతృత్వంలో అనేక రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రమగామిగా నిలిపారన్నారు.బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఉద్భవించిన పార్టీ. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల డీఎన్ఏ లోనే పోరాటం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంగా ఉండి ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.