BRS Party | లోక్సభలో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేస్తూ లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. తాజా ఆదేశాల మేరకు లోక్సభలో పార్టీ ఫ్లోర్లీడర్గా కొనసాగనున్నట్లు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాల ఉత్తర్వు అందిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి క్రీయాశీలకంగా వ్యవహరిస్తామని, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల గొంతుకను బీఆర్ఎస్ వినిపిస్తుందని స్పష్టం చేశారు.