Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేవరకు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు తొమ్మిది రౌండ్లలో కలిపి మొత్తం 46,498 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణికి 12,413 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్కు 17,838 ఓట్లు వచ్చాయి.