Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కారు దూసుకెళ్తోంది. 10వ రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి 6,395 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొత్తం పది రౌండ్లలో కలిపి సబితా ఇంద్రారెడ్డికి 54,610 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 48,215 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 29,971కి ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.