BRS Bhavan | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు.
జనవరి 7, 2019: ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించాలని ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎంపీల బృందం వినతిపత్రం అందజేసింది.
అక్టోబర్ 9, 2020: ఢిల్లీలోని వసంతవిహార్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్దయాళ్ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
నవంబర్ 4, 2020: రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి భూమిపత్రాలు అందజేశారు.
సెప్టెంబర్ 2, 2021: పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ భవనానికి భూమిపూజ చేశారు.
డిసెంబర్ 14, 2022: నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
మే 4, 2023: పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం