హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో సమావేశం జరుగనున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ర్టానికి సంబంధించి పార్లమెంట్లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలపై చర్చించనున్నారు.