హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పష్టం చేశారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు చిరు ఉద్యోగులకు కూడా సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని గుర్తుచేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్పు చెందినట్టే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘాన్ని భారత ప్రైవేటు ఉద్యోగ్ సంఘ్గా మార్చినట్టు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు ఎంపీ సంతోష్కుమార్కు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, సినీ దర్శకుడు సంపత్ నంది, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్నాయక్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో పర్వతారోహకురాలు ఆశా మాలావ్య మంగళవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్లో మొకలు నాటారు. మహిళా భద్రత, సాధికారతను సమాజంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఆమె చేపట్టిన 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర హైదరాబాద్కు చేరుకొన్నది. ఈ సందర్భంగా ఆశా మాలవ్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ చక్కటి కార్యక్రమం అని, మొకలు నాటడం ఆనందంగా ఉన్నదన్నారు. అనంతరం ఎంపీ సంతోశ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆశాను ఎంపీ అభినందించి కొంత నగదు సాయం అందజేశారు.
పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. మేడ్చల్ జిల్లా అటవీశాఖ నేతృత్వంలో కీసర రిజర్వ్ ఫారెస్ట్లో వనదర్శిని నిర్వహించారు. ఎంపీ సంతోష్కుమార్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న కీసర ఎకో అర్బన్ పార్కు నాగారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీసుకెళ్లి వివిధ రకాల చెట్లు, ఔషధ మొకలను పరిచయం చేశారు. ఈ వివరాలను సంతోష్కుమార్ ట్విట్టర్లో షేర్చేశారు. అటవీశాఖ చక్కగా పనిచేస్తున్నదని కొనియాడారు.