Bajireddy Govardhan | నిజామాబాద్ : రాష్ట్రంలో హామీలను గాలికి వదిలేసి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెసోళ్లే బొంద పెడుతారని ఆ పార్టీ నాయకుడే ఒకరు తనకు ఫోన్ చేసి చెప్పారని బాజిరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బాజిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక పాత ఫ్రెండ్ నాకు ఫోన్ చేసిండు. నిజామాబాద్లో నువ్వు(బాజిరెడ్డి) గెలుస్తున్నవ్ అని చెప్పాడు. పాత కాంగ్రెస్ నేతలంతా కలిసి రేవంత్ రెడ్డిని ఏదో ఒక రోజు బొంద పెడుతారని ఆయన నాతో చెప్పారు. హనుమంత రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వీళ్లంతా కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. రేవంత్ను ఎప్పుడు పొడిచేది తెల్వదు అని నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడని బాజిరెడ్డి తెలిపారు.
పేగులు మెడలో వేసుకోవడానికి.. నువ్వేమైనా మేకలు, కోళ్లు కోసేటోడివా..? బొంద పెట్టడానికి, బుల్లెట్లు దించడానికి నువ్వు ముఖ్యమంత్రివా..? రౌడీవా..? అని రేవంత్పై బాజిరెడ్డి నిప్పులు చెరిగారు. హామీలు నెరవేర్చకుండా ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటున్నావు అని రేవంత్ను దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలను పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుక్కల కంటే హీనంగా చూస్తారు అని బాజిరెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్లే బొంద పెడతారు..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు.. హన్మంత రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కత్తులు పట్టుకుని రేవంత్ రెడ్డి వెనక పడుతున్నారని నా పాత ఫ్రెండ్ కాంగ్రెస్ అయినా ఫోన్ చేశాడు -… pic.twitter.com/eLqqqxOK44
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2024