హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం మహిళల బాధను విస్మరించడమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర మంత్రి వైఖరి మహిళా లోకాన్ని నిరుత్సాహపరిచిందని ట్విట్టర్ వేదికగా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. రుతుక్రమ పోరాటాలను మంత్రి కొట్టిపారేయడం విచారకరమని పేర్కొన్నారు. నెలసరి ఎంపిక కాదు.. అది సహజమైన జీవ ప్రక్రియ అని తెలిపారు. వేతనంతో కూడిన సెలవులను తిరసరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్టేనని పేర్కొన్నారు. మహిళలు ఎదురొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల కనీసం సానుభూతి చూపకపోవడం విస్తుగొలిపే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది’ అని కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చిన ప్రజానీకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. యశోద దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమై దవాఖాన నుంచి కేసీఆర్ డిశ్చార్జి అయ్యారని, చికిత్స అందించిన యశోద డాక్టర్లు, నర్సులతోపాటు అన్నివిధాలా సహకరించిన దవాఖాన సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ క్లిష్టమైన సమయంలో దేశ నలుమూలల నుంచి లభించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞులమని ఆమె పేరొన్నారు.