TG Assembly | దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ తెలిపారు. వరి రైతులకు రూ.500 పంట బోనస్ ఇస్తున్నామని.. మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.
కాగా, గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించడంపైనా మండిపడ్డారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని, పంట బోనస్ ఇవ్వాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.