Patnam Narender Reddy | వికారాబాద్ : సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానన్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముందు తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్కు ఎమ్మెల్యే పట్నం సవాల్ విసిరారు. తనపై గెలిచిన తర్వాత.. కేసీఆర్పై పోటీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కొండగల్లో బుధవారం ఉదయం పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సొంత కార్యకర్తలకు న్యాయం చేయని రేవంత్.. కొడంగల్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. పీసీసీ పోస్ట్ రూ.300 కోట్లకు కొనుక్కున్నాడని ఆయన కార్యకర్తలే చెప్పారు. ఓటుకు నోటు దొంగ రేవంత్. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావ్ కదా.. మరి ఇప్పుడు పోటీ ఎలా చేస్తావ్? అని రేవంత్ను పట్నం నిలదీశారు.
కేటీఆర్ దత్తత తీసుకున్నాక ఇక్కడ అభివృద్ధి జరిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. కోస్గిలో, మద్దూర్లో రోడ్లు వైడనింగ్ అయ్యాయి. మున్సిపాలిటీల అభివృద్ధి జరిగింది. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామాలలో రోడ్లు, సంక్షేమ పథకాలను అమలు చేసినందున ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను ఈసారి 20 నుండి 30 వేల మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అని నరేందర్ రెడ్డి అన్నారు.