Jagadish Reddy | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగా ణ): విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 50 వేలకోట్లకు పైగా అప్పులు తీర్చిందని, మిగిలిన అప్పులను విద్యుత్తు సంస్థలే తీర్చుకుంటాయని చెప్పారు.
శాసనసభలో విద్యుత్తు రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్తు పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయకుండా.. అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపుతామమంటే సం తోషమని అన్నారు. తాము ఇక నుంచి అప్పులే చేయమన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, ఇదే తరహాలో పురోగమించాలని సెటైర్లు వేశారు.
సభలో ఉన్న ప్రతి ఒక్కరికి అప్పులున్నాయి.. అప్పులున్నంత మాత్రం మనందరం చెడ్డవాళ్ల మా? అని ప్రశ్నించారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2014 జూ న్ 2 నాటికి విద్యుత్తు సంస్థల ఆస్తులు 44,438 కోట్లుంటే.. అప్పు 22,423 కోట్లు ఉండేదని, ఇప్పుడు అప్పులు 81,016 కోట్లు కాగా.. ఆస్తులను 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎకడా నష్టం జరగలేదని స్పష్టంచేశారు. దేశంలో అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్తును అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు.
కిరోసిన్ దీపాలతో చదువులు
కాంగ్రెస్ పాలనలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే.. పెద్దలకే పెద్ద పరీక్షగా ఉండేదని జగదీశ్రెడ్డి గుర్తుచేశారు. ‘పరీక్షలు వస్తున్నాయంటే కిరసనాయిల్ దేవులాడటం.. క్యాండిల్స్ కొనుకొచ్చుకునే పరిస్థితి ఉండేది. నేను పదో తరగతి చదువుకున్నప్పటి నుంచి నా పిల్లలు పదో తరగ తి చదువుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సభలోని అనేకమంది సభ్యుల ఇండ్లల్లో ఇదే పరిస్థితి ఉండేది.
ఒకప్పుడు పల్లెల్లో నీళ్ల కోసం బోరుబావి దగ్గరికి పోయాక కరెంటు పోతే.. ఎన్ని గం టలు అకడే ఉండాలో తెలియని పరిస్థితి. బిందె డు నీళ్లు లేకుండా ఇంటికి పోతే వంటకు ఎసరుపెట్టే పరిస్థితి ఉండేదికాదు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపార రంగాలు, జనరేటర్ లేని ఏ ఒక షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా?’ అని ప్రశ్నించారు.
ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్లో జరిగిందని, ఇదో ప్రపంచ రికార్డు అని గుర్తుచేశారు. ఆనాడు ఊర్లల్లోకి పో తే విద్యుత్తు అధికారులను పంచాయతీ ఆఫీసు ల్లో నిర్బంధించే పరిస్థితులుండేవని తెలిపారు. ‘మా హయాంలో అర ఎకరం కూడా ఎండలేదు. విద్యుత్తు కోసం ధర్నాలు చేసే అవకాశమివ్వలేదు. ఒక్క రోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదు’ అని స్పష్టంచేశారు.
నాడు ఇరవై ఎకరాలున్న రైతు కూడా కూలీగా..
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం పరిస్థితి దారుణంగా ఉండేదని జగదీశ్రెడ్డి గుర్తుచేశారు. బండెడ్లు అమ్మడం నుంచి రైతుల పరిస్థితి మొదలైతే.. చివరకు పుస్తెలు అమ్ముకునే దుస్థితి ఉండేదని విమర్శించారు. ఏ భూమిలో అయితే బోరు వేసిండ్రో.. ఆ భూమినే అమ్ముకునే దుస్థితి ఆనాడు ఉండేదని అన్నారు. 10, 20 ఎకరాలున్న రైతులు హైదరాబాద్కు కూలీకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు.
దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు వెంబడి పార, గడ్డపార పట్టుకుని పోతుంటే వాళ్లను ఆపి ఏ ఊరు అని అడిగితే పాలమూరు అని చెప్పేవారని తెలిపారు. 2014 తర్వాత ఎక్కడైనా విద్యు త్తు దొరికినా.. దానిని సరఫరా చేయడానికి రాష్ట్రంలో వ్యవస్థలేని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. ‘నాడు ఉత్తర- దక్షిణ విద్యుత్తు నెట్వర్ మధ్య అనుసంధానం లేదు.
33/11 కేవీ సబ్స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం ఉండకపోయేది. 133, 220, 400 కేవీ సబ్స్టేషన్లు లేకపోవటంతో అందుబాటులో విద్యుత్తు ఉన్నా బ్యాక్డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. రైతాంగానికి వరుసగా 6 గంటల కరెంటు ఇవ్వగల మా? అని ఆనాడు విద్యుత్తు ఉద్యోగులకు ఓ క ల ఉండేది. కానీ ఇవాళ 24 గంటలు ఇవ్వాలని నిర్ణయించిన మరుక్షణం ఎకువగా సంతోషించింది విద్యుత్తు ఉద్యోగులే.
ప్రస్తుత సీఎం పార్టీ (టీడీపీ) అధికారంలో ఉన్నప్పుడు.. విద్యుత్తు కోసం నేటి ఉప ముఖ్యమంత్రి పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. ఇదే అసెంబ్లీలోకి ఎండిపోయిన వరి, మక కంకులు, పత్తి చేలు తీసుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి పార్టీ అధికారం లో ఉన్నప్పుడు సీఎం పార్టీ కూడా అలాగే చేసిం ది. సభలో ఆ ఘటనలు నిత్యకృత్యాలుగా ఉండే వి. కానీ పదేండ్ల మా పాలనలో ఒక్కరోజు ఇ లాంటి అవకాశం లేకుండాచేశాం’ అని చెప్పారు.
భయపడితే.. పరిస్థితి ఇలా ఉండేదికాదు..
విద్యుత్తు సంస్థల వద్ద డబ్బుల్లేకపోవడం.. అధికంగా విద్యుత్తు అందించాల్సి రావడం వల్లే అప్పు తెచ్చామని జగదీశ్రెడ్డి తెలిపారు. తెచ్చిన అప్పులో సగానికి పైగా తీర్చేశామని స్పష్టం చేశా రు. ‘ఉమ్మడి పాలకులు ఇచ్చి పోయిన రూ.22 వేల కోట్లను పక్కనపెడితే.. మేం తీసుకొచ్చిన అప్పుల్లో సగానికి పైగా తీర్చేశాం. కాంగ్రెస్ వాళ్ల లా.. అప్పు అయితే ఎలా అని భయపడుతూ కూర్చుంటే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదు.
ఇప్పుడు ప్రపంచంలో ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా.. తెలంగాణవైపు, హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. మేమిచ్చిన 24 గంట ల నిరంతరాయ విద్యుత్తే ఇందుకు ప్రధాన కారణం. మన బతుకు లిఫ్ట్ల మీదే ఆధారపడి ఉన్నది. ఈ రోజు మంచినీళ్లు రావాలన్నా.. వ్యవసాయం పురోగమించాలన్నా విద్యుత్తే కావాలి. అందుకే మేము మొదట విద్యుత్తు రంగాన్ని అభివృద్ధి చేశాం. ఈ రోజు తెలంగాణ నంబర్వన్గా నిలిచిందంటే కారణం విద్యుత్తే’ అని చెప్పారు.
నిరంతర విద్యుత్తు కొనసాగిస్తారా?
కేంద్రప్రభుత్వం టన్ను బొగ్గుకు రూ.400 చొ ప్పున గ్రీన్ సెస్సు వేయడం, బొగ్గు ధర టన్నుకు రూ.800 పెరగడం, రైల్వే రవాణా చార్జీలు పెం చడం వంటి కారణాలతో డిస్కంలు ఆర్థిక భారా న్ని మోయాల్సి వస్తున్నదని జగదీశ్రెడ్డి తెలిపారు. ఎన్ని సమస్యలు ఎదురైనా పదేండ్లలో విద్యుత్తు రంగంలో అద్భుత విజయాలు సాధించామని చెప్పారు. ‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న చర్యల వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వగలిగిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
మరి కాంగ్రెస్ పాలించిన ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో మీ ప్రభుత్వాలు ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోయాయి? అక్కడ కాంగ్రెస్ ఇవ్వలేకపోవడాన్ని బట్టే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నదా? 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు తెలుపు రేషన్ కార్డుదారులకు ఎప్పటినుంచి ఇస్తారో తెలపాలి. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టకూడదని కోరుతున్నాం. దీనిపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. విద్యుత్తు ధరల భారాన్ని ప్రజలపై మోపకుండా ఇలాగే కొనసాగిస్తారా లేదా? స్పష్టం చేయాలి’ అని డిమాండ్ చేశారు.
రైతులకు నష్టం జరగకుండా విద్యుత్తు సరఫరా
తెలంగాణ వచ్చేనాటికి విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్లు మాత్రమే ఉన్నదని జగదీశ్రెడ్డి తెలిపారు. కాలువలపై మోటర్ల ఏర్పాటుకు అనుమతివ్వడం, కొత్త బోర్ల ఏర్పా టుతో కనెక్షన్లు పెరిగినట్టు చెప్పారు. చెక్డ్యామ్ల ద్వారా కనెక్షన్లు పెరిగాయని అన్నారు. ‘2013-14లో రెండు పంటలు కలిపి 40 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, గత ఏడాది రెండు కోట్ల 30 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. విద్యుత్తు వినియోగం, పంట సాగు పెరిగిందనడానికి ఇదే సాక్ష్యం.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 19.22 గంటలు కరెంటు సరఫరా చేసినట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 2018 నుంచి 2023 ఏప్రిల్ వరకు 24 గంటల కరెంటు ఇచ్చినట్టు ప్రభుత్వమే ఒప్పుకొన్నది. 2014లో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,772 మెగావాట్లు ఉంటే, నేడు 19,475 మెగావాట్లు ఉన్నదని శ్వేతపత్రంలో చెప్పారు. ఇది కూడా వాస్తవమే. కేటీపీపీ 30 శాతం గతంలో పూర్తికాగా, మేము అధికారంలోకి వచ్చాకే 70 శాతం పూర్తయింది.
600 మెగావాట్ల కొత్తగూడెం ప్రాజెక్టు పూర్తిగా మేమే చేపట్టి పూర్తిచేసినం. భద్రాద్రి ప్రాజెక్టుకు సంబంధించి బీహెచ్ఈఎల్, బుల్స్ సంస్థకు మధ్య వ్యవహారం. అందులో గత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. భద్రాద్రి ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా నష్టం లేదు. ఎన్జీటీ కేసు వల్లనే అది ఆగిపోయింది. విద్యుత్తుపై విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం చెప్పటం సంతోషకరం. తాము కడిగిన ముత్యంగా నిరూపించుకొంటాం’ అని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.