Telangana | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల రుణమాఫీపై సీఎం, డిప్యూటీ సీఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు… నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైంది అని పేర్కొంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.
అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసు పాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత పెట్టారు. వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమే. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదం అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారు. నిన్న నిరుద్యోగ భృతిపై ఎగవేత – నేడు రైతు రుణ మాఫీపై దాట వేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అంటూ హరీశ్రావు ఓ వీడియోను విడుదల చేశారు.
కాంగ్రెస్ లో అబద్దాల పోటీ..
పోటీపడి మరీ అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ నాయకులు..కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు… నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైంది.
అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పోటీ పడుతున్నారు. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ పార్టీ… pic.twitter.com/cifNPXGhyT
— Harish Rao Thanneeru (@BRSHarish) April 19, 2024