BRS | బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుపై ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్యే చింత్రా ప్రభాకర్ శనివారం ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఈసీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రఘునందన్ రావుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. పరుష పదజాలంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.