KCR | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్మ్యాప్పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భవన్ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ గులాబీ శ్రేణులకు అభివాదం చేస్తూ భవన్లోకి వెళ్లారు.