KCR | సిద్దిపేట : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్కు ఘనస్వాగతం పలికారు. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. ఇక కేసీఆర్ వెంట సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు 100 కార్లలో బయల్దేరి వెళ్లారు.
మరి కొద్దిసేపట్లో కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్కు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.