KCR | హైదరాబాద్ : సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.