రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. సీఎస్ శాంతికుమారికి వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు జగదీశ్రెడ్డి, మధుసూదనాచారి, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద్, బాల్క సుమన్, పాడి కౌశిక్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి, దండె విఠల్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే రాష్ట్రంలో ఎకరం పంట కూడా ఎండనిచ్చేవారు కాదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతాంగం పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని రైతుల రుణాలను మాఫీ చేయాలని, తాము ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టంచేశారు.
మంగళవారం ఆయన తెలంగాణభవన్లో మాజీ మంత్రు లు గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కేపీ వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్తో కలిసి మీడియాతో మాటాడుతూ.. గత 15 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పొలాలకు వెళ్లి, పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అనుభవ రాహిత్యంతో రైతులు సంక్షోభంలోకి వెళ్లారని ఆందోళన వ్యక్తంచేశారు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయంలో చెక్డ్యామ్లు నిర్మించి కాళేశ్వరం నీళ్లను అలందించామని వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒక ఎకరం కూడా ఎండనిచ్చేవారు కాదని పేర్కొన్నారు. కరీంనగర్కు కేసీఆర్ వస్తున్నారని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డికి రైతులు ఉన్నారన్న సోయి కూడా లేదని జగదీశ్రెడ్డి మండిప్డడారు. ఢిల్లీకి డబ్బులు పంపించడంపైనే దృష్టి పెడుతున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిదానికీ నోరు పారేసుకోని కేసీఆర్పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని, భట్టి విక్రమారకు, ఉత్తమ్కుమార్రెడ్డికి రైతుల గురించి తెలియదని విమర్శించారు. పత్రికలకు లీక్లు ఇచ్చి పెద్దగా రాయించి బతుకుదామని అనుకుంటున్నారని, తెలంగాణ రాక ముందు ఇంతకంటే ఎకువ కుట్రలు చేశారని దుయ్యబట్టారు. సాగునీరు, తాగునీరు ఎలా ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ సీఎంగా ఉంటే ఇంత బాధ ఉండేదికాదని రైతులు చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన 100 రోజుల్లోనే 2014 కంటే ముందటి పరిస్థితులు వచ్చాయని జగదీశ్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో రైతాంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని, రూ.రెండు లక్షల రుణమాఫీ వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రూ.500 బోనస్ చెల్లించి, ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని, తక్షణం కాలువలు, చెరువుల కింద ఉన్న పంటలకు నీటిని విడుదల చేయాలని కోరారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు జీ జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు విఠల్, శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేశ్రెడ్డి ఉన్నారు.