ఒకరు ఆరడుగుల బుల్లెట్టు.. మరొకరు ఏకే47! ఇద్దరూ కలిస్తే బీఆర్ఎస్ డబుల్ బ్యారెల్ గన్. రెండు నెలలుగా మంత్రులు హరీశ్, కేటీఆర్.. తమదైన దూకుడును ప్రదర్శించారు. సభలు, రోడ్షోలతో ఎన్నికల ప్రచారాన్ని వేరే లెవల్కు తీసుకెళ్లారు.
ఎన్నికల కురుక్షేత్రంలో అలనాటి కృష్ణార్జునులను గుర్తు చేశారు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు కుడి, ఎడమల సైన్యంగా వ్యవహరిస్తూ, క్యాడర్లో జోష్ పెంచారు. పార్టీ అభ్యర్థులకు కొండంత అండగా నిలిచారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ ఇద్దరు నేతలు కృష్ణార్జునుల వలె రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలను చుట్టివచ్చారు. గులాబీ సైన్యాన్ని ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ క్యాడర్ను ఉత్సాహపరిచారు. ప్రజల మద్దతును కూడగట్టడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో ఎప్పటికప్పుడు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టారు. పార్టీ అధినేత వ్యూహాన్ని అమలు చేయడంలో నూటికి నూరుపాళ్లు శ్రమించారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ
గత 60 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ సైన్యాన్ని సమర్థంగా నడిపించారు. సీఎం కేసీఆర్ తర్వాత అత్యధిక సభలు, రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే దాదాపు 30 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత స్పీడ్ మరింత పెంచారు. ప్రభుత్వ పనితీరు, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని సమర్థంగా వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం నలుమూలలా జరిగిన 30 భారీ బహిరంగసభల్లో పాల్గొన్నారు. తన ప్రసంగాలతో మహిళలు, యువత, విద్యావంతులను ఆలోచింపజేశారు. ఆయన సంధించిన వాక్బాణాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఒకొక నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతోపాటు ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మలాజిగిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకేరోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలలో పాల్గొన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్.. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్లో ప్రచారం చేశారు. జయప్రకాశ్ నారాయణ (జేపీ), గోరటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారికి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఓలా, ఊబర్, జొమాటో వంటి వాటి ద్వారా సేవలు అందిస్తున్న గిగ్వర్కర్లతో ప్రత్యేకంగా సంభాషించి, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. హైదరాబాద్లో ఫస్ట్టైం ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, రియల్ఎస్టేట్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు, వివిధ వర్గాల ప్రముఖులు, ఉద్యోగులు, ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
సమాజంలో సగభాగమైన మహిళలతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి గెలిచిన తర్వాత మహిళల కోసం చేపట్టే అనేక కార్యక్రమాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. పలు కులసంఘాల నాయకులు, మైనార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ తరపున ఇచ్చే పత్రికా ప్రకటనల నుంచి సామాజిక మాధ్యమాల కోసం రూపొందించాల్సిన కంటెంట్ వరకు విస్తృతంగా చర్చించి దిశా నిర్దేశం చేశారు. మొత్తం 60 రోజుల పార్టీ ప్రచారంలో అత్యంత హుందాగా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేసినా, కేవలం పాజిటివ్ అంశాలే ఎన్నికల ఎజెండా కావాలన్న సానుకూల ఆలోచనతో.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
దీంతో క్షేత్రస్థాయి నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం వరకు పూర్తి సమన్వయంతో ప్రచారపర్వంలో ప్రత్యర్థులకు అందనంత వేగంగా బీఆర్ఎస్ దూసుకెళ్లింది. దీంతోపాటు ప్రతిరోజూ వేలాది మందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జీలు, వార్రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఒపీనియన్ మేకర్లు, ముఖ్యమైన వ్యక్తులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి పార్టీ కోసం వారి మద్దతును కూడగట్టారు.
సాధించిన ప్రగతిని వివరిస్తూనే భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచడంలో కేటీఆర్ సఫలీకృతులయ్యారు. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే పదిలంగా ఉంటుందో ఆలోచించాలని ఆయన చేసిన విజ్ఞప్తి ప్రజలను ఆకట్టుకున్నది. అభివృద్ధి ఎజెండాతో కేటీఆర్ సాగించిన ప్రచారపర్వం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. అదే సందర్భంలో ప్రతిపక్షాల డొల్లతనాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ ఏవిధంగా వంచించిందో ఉదాహరణలతో వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజలకు మరోసారి గుర్తుచేశారు. సమైక్యరాష్ట్రంలో 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ కేవలం పదేండ్లలోనే సాధించిందని, ఇది విజన్ ఉన్న నాయకత్వం ఉండటం వల్లే సాధ్యమైందని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉన్నదంటూ కేటీఆర్ చేసిన విజ్ఞప్తి ప్రజల్లో చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశమే శిరోధార్యంగా, పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి హరీశ్రావు ఈ ఎన్నికల ప్రచారంలో తనదైన భాగస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ప్రచారపర్వంలోకి దిగిన హరీశ్.. 60 నియోజకవర్గాల్లో అలుపెరగకుండా తిరిగారు. ఒకవైపు సీఎం కేసీఆర్తో ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొంటూనే మరోవైపు మరికొన్ని బహిరంగ సభలు, రోడ్ షోలకు హాజరయ్యారు. ఆయా జిల్లాల్లో గులాబీ దళంలో ఉత్తేజాన్ని నింపారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ప్రజల్లో ప్రబలమైన విశ్వాసాన్ని పాదుకొల్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సన్న బియ్యం, రైతుబంధు, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను ప్రజలకు వివరించారు. ‘రిసు వద్దు.. కారుకే ఓటు గుద్దు’ అంటూ హరీశ్రావు ఇచ్చిన నినాదాలు ప్రజల్లో మార్మోగాయి. కారు, హెలికాప్టర్ ద్వారా ఆయా జిల్లాల్లో జరిపిన హరీశ్రావు పర్యటనలు బీఆర్ఎస్ను గెలుపునకు మరింత దగ్గర చేశాయి. రెండు నెలలపాటు ఆయన అవిశ్రాంతంగా రాష్ట్రం అంతటా తిరిగారు. తాను ప్రయాణిస్తున్న సమయంలోనూ నియోజకవర్గాల క్యాడర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు, ఆరోపణలను తిప్పికొడుతూ తెలంగాణభవన్, ఇతర జిల్లాల్లో అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు. టీవీ చానళ్ల డిబేట్లలో పాల్గొని మూడోసారి బీఆర్ఎస్ సరారు ఏర్పాటు అవశ్యకతను తనదైన శైలిలో వివరించారు. కాంగ్రెస్, బీజేపీ చేసే తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ విజయం గురించి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కుల, మత సంఘాలతో హరీశ్రావు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణభవన్ సహా వివిధ జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో హరీశ్రావు సమక్షంలో వేల సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
అక్టోబర్లో మెదక్, తాండూర్, ములుగు, నర్సంపేట, డోర్నకల్, నకిరేకల్, తుంగతుర్తి, మహేశ్వరం, కల్వకుర్తి, దుబ్బాక, గజ్వేల్, మక్తల్, కొడంగల్, దేవరకద్ర, జుకల్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, మానకొండూర్, సిద్దిపేట, మంచిర్యాల, చెన్నూరు, జహీరాబాద్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, ఆదిలాబాద్, స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాల సభల్లో పాల్గొన్నారు. నవంబర్లో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మెదక్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు, సిద్దిపేట, మలాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, హుజూరాబాద్, ములుగు, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, నారాయణ్ఖేడ్, మానకొండూరు, మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, జనగామ, ఆలేరు, భువనగిరి, రాజేంద్రనగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకుపైగా నిజామాబాద్లోనే బస చేసి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాలొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బాసటగా నిలిచారు. 70కిపైగా రోడ్ షోలు, పాదయాత్రలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కులసంఘాల సమ్మేళనాలు, యువత, మహిళ, కార్మికుల సమ్మేళనాలలో విస్తృతంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలో ప్రజలకు అర్థమయ్యే తీరులో చకగా వివరించారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు.
తమ పార్టీపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు దీటుగా సమాధానాలిచ్చారు. ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న సభలు, రోడ్ షోలు, సమావేశాలకు మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. నేరుగా మహిళల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కవితకు ఘనస్వాగతం లభించింది. ప్రచార కార్యక్రమాల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన కవిత.. కోరుట్ల టౌన్ బీజేపీ అధ్యక్షుడు, ఇద్దరు కౌన్సిలర్లతోపాటు దాదాపు 200 మంది కార్యకర్తలను పార్టీలో చేర్చుకొని ఆ నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అయిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో యువత కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.