Telangana Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు. సునీతా లక్ష్మారెడ్డి గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్గా కొనసాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి, 2019, ఏప్రిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందారు.