RS Praveen Kumar |హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని దేవునిగుట్ట తండాలో రూ. కోటితో బీటీ రోడ్డు నిర్మించారు. నిర్మించిన 24 గంటలకే చేతితో పీకితే, పెచ్చులుగా ఊడిపోయింది డాంబర్ రోడ్డు. ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మించడం ఏంటని నిలదీయగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి తండా వాసులను కాంట్రాక్టర్ బెదిరింపులకు గురి చేశాడు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతోనే, ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఈ నాసిరకం రోడ్లపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అచ్చం తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన లాగానే ఉంది ఈ డాంబర్ రోడ్డు. ఇట్లాంటి ఫేక్ రోడ్లను మనం నిర్మించుకుంటూ బీహారీలను నిందించడం సరికాదు అని పేర్కొన్నారు. ఈ రోడ్ల మీద నమ్మకం లేకనే మన మంత్రి వెంకన్న హెలికాప్టర్ను విరివిగా వాడుతున్నట్లుంది. ఇంకా ఏ మొహం పెట్టుకోని డిసెంబర్లో ప్రజాపాలన వారోత్సవాలు ఫెయిల్యూర్ సిటీలో? నిర్వహిస్తారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
ఇది ఎక్కడో బీహార్ కాదు తెలంగాణ లోనే!
రేవంత్ రెడ్డి ఇలాకాలో నాసిరంకంగా రోడ్ల నిర్మాణం
రోడ్డు వేసిన 24 గంటలకే, పెచ్చులుగా ఊడిపోతున్న తార్ రోడ్డు
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని దేవునిగుట్ట తండాలో, రూ.1 కోటి రూపాలతో నిర్మించిన బీటీ రోడ్డు
నిర్మించిన… pic.twitter.com/ONh3utdpWE
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2025