శివ్వంపేట, ఆగస్టు 10: దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు బోనాలు సమర్పించి మొకులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్యాదవ్, సీనియర్ వార్డు సభ్యుడు బోళ్ల సదానంద్ ముదిరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు యు. వెంకటేశ్గౌడ్, చిట్టబోయిన మహేందర్ యాదవ్, బజారి మహేందర్రెడ్డి, యు.సత్యనారాయణగౌడ్, ఎం.రవిముదిరాజ్, బోయిని సత్యనారాయణ, జి.లక్ష్మీనారాయణ, ఎం.అశోక్, టి.ప్రభుగౌడ్ పాల్గొన్నారు.