హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం నయవంచన, దగా, వెన్నుపోటు అని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రంజిత్రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే ఎంపీ అయ్యారని, ఆయన ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణమని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్రెడ్డి పార్టీకి దూరమవుతారా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో కేసీఆర్కు అండగా ఉండాల్సిందిపోయి వెన్నుపోటు పొడుస్తారా? అని మండిపడ్డారు. చేవేళ్ల కాంగ్రెస్ టికెట్ను రంజిత్రెడ్డి వంద కోట్లకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని చెప్పారు. తనకు మరోసారి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని రంజిత్రెడ్డి చెప్తే కేసీఆర్ నమ్మారని, ఆ నమ్మకాన్ని రంజిత్రెడ్డి వమ్ము చేశారని మండిపడ్డారు. చేవెళ్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, రంజిత్రెడ్డికి ఓటమి తప్పదని చెప్పారు.