హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల దాకా అదేవిధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సోమవారం ఆయన తెలంగాణభవన్లో లోక్సభ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత బండి సంజయ్ కూడా కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను కనుమరుగు చేద్దామని అంటున్నారని, బీజేపీ హేమాహేమీలుగా చెప్పుకునే వారంతా బీఆర్ఎస్ చేతిలోనే ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ప్రత్యే క నోటిఫికేషన్లు విడుదల చేయడమే కాంగ్రెస్, బీజేపీ మైత్రికి నిదర్శనమని చెప్పారు.
బీఆర్ఎస్ నేతల మీ ద, ఇండ్ల మీద దాడులు, ఇండ్ల ముందు బాంబులు కాల్చడం వంటి చిల్లర చేష్టలకు కాంగ్రెస్ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గ్రామ స్థాయిల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై చేస్తున్న భౌతికదాడులు, దౌర్జన్యాలు, వెకిలిచేష్టలు వారి దిగజారుడుతనానికి, అపరిపక్వతకు అద్దంపడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్వేతపత్రాలకు దీటుగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ ప్రజల హకులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.
మొదటి వారంలో నియోజకవర్గ సమావేశాలు
పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు, నేతలు నిస్సంకోచంగా, నిర్భయంగా సూచనలు ఇచ్చారని నిరంజన్రెడ్డి తెలిపారు. 16 పనిదినాల్లో సుమారు 125 గంటలపా టు సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. ఒకో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 70 నుంచి 100 మంది చొప్పున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని వివరించారు.
పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి ఆయన సూచనల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాల షెడ్యూల్ను రూపొందిస్తామని, వచ్చే నెల మొదటివారం లో ఈ సమావేశాలు ఉంటాయని తెలిపారు. రాము డు అందరివాడు అని, తమ హృదయాల్లో, తమ పేర్లల్లో కొలువైన వాడు, నెలువైన వాడు అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్ హయాంలోనే యాదగిరిగుట్ట ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిరించామని గుర్తుచేశారు.
పరిణతి లేని సీఎం రేవంత్: మధుసూదనాచారి
సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వెంకట్రెడ్డి బీఆర్ఎస్పై చేస్తున్న వ్యాఖ్యలు వారి భయానికి, అసహనానికి నిదర్శనమని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. రేవంత్రెడ్డి మాదిరిగా ఇంత పరిణతి లేని ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని చెప్పా రు. అడ్డగోలు కూతలతో తన స్థాయిని దిగజార్చుకున్నారని మండిపడ్డారు. వీరికి కాలమే బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.