హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. మంగళవారం టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగలబోతున్నదని, తెలంగాణలో బీజేపీకి స్పేస్ లేదని స్పష్టంచేశారు. సికింద్రాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి గెలిచే అవకాశం లేదని, అక్కడ బీఆర్ఎస్ గెలవబోతున్నదని పేర్కొన్నారు.
జవాబు: ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన బలంగా వాదించే పంచ్ కావాల్సి ఉన్నది. ప్రభుత్వ నియంతృత్వాన్ని ఎదుర్కొని, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారానికి పంచ్గా పనిచేస్తాం. రాబోయే కాలంలో బీఆర్ఎస్సే ప్రజల బలం, శక్తిగా పనిచేస్తుంది. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. మళ్లీ అధికారంలోకి వస్తాం.
జవాబు: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే అట్టర్ప్లాప్ అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎదురు దెబ్బతినబోతున్నది. బీజేపీకి తెలంగాణలో స్పేస్ లేదు. బీఆర్ఎస్ 8 నుంచి 12 స్థానాలు గెలుస్తున్నది. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సికింద్రాబాద్లో గెలిచే అవకాశం లేదు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నాడు. రాష్ర్టాన్ని కాపాడుకుంటూనే, జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతాం. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు చాలా బాగుండే. అక్కడ రెండు పార్టీ కార్యాలయాలను కూడా ఏర్పాటుచేశాం. అక్కడి ప్రజలందరూ బీఆర్ఎస్ వెంట నడిచారు. దురదృష్టకరంగా ఇక్కడ ప్రభుత్వం కోల్పోయాం. లేకుంటే మహారాష్ట్రలో మంచి ప్రభావం చూపేవాళ్లం. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. మోదీ చెప్తున్నట్టు 400 సీట్లు వచ్చేది లేదు. మొదటి విడత ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన విధంగా ఫలితాలు రావడం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. కేంద్రంలో ప్రభావం చూపుతాం.
జవాబు: ఏపీ ఎన్నికల్లో ఏమి జరిగినా మాకు సంబంధం లేదు. చంద్రబాబు గెలిచినాక జగన్ గెలిచినా మాకు బాధలేదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం.. మళ్లీ జగన్ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత ఎన్నికల్లో కలుగజేసుకోవడం లేదు. భవిష్యత్తులో పరిశీలిస్తాం.
జవాబు: ప్రజల అభిమానం ఉన్నంతకాలం పార్టీల గుర్తులు,పేర్లు మార్చినంత మాత్రంలో నష్టం జరుగదు. టీడీపీలో పనిచేసిన 20 ఏండ్లపాటు సైకిల్ గుర్తుపై, ఆ తర్వాత రైతునాగలి గుర్తుపై, సిద్దిపేటలో ఒకసారి బస్సు గుర్తుపై గెలిచా. ఆ తర్వాత కారు గుర్తుపై గెలిచి, పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా సమర్థంగా పనిచేశాను. పార్టీ పేరు మార్చినంత మాత్రాన ఓడిపోయామనుకోవడం లేదు. ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీరినందున, ఒకసారి కాంగ్రెస్ను గెలిపిద్దామనుకున్నారు. నాలుగు నెలల్లోనే ప్రజలకు ఆ పార్టీ రంగు తెలిసింది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చే ఆలోచన లేదు. అది సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ దగ్గర ఒక పార్టీ పేరు రద్దు అయిన తర్వాత ఐదేండ్ల వరకు దానిని ఫ్రీజింగ్ చేస్తుంది. మళ్లీ పార్టీ పేరు మార్చే ఆలోచన లేదు.
జవాబు: బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నాను. అక్కడక్కడ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి తెలుసు. కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని వేధిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కన్ఫ్యూజ్ కావొద్దు. ఈ రోజు నా ఇంటర్వ్యూను రాష్ట్రంలోని కార్యకర్తలందరూ చూసి ఉంటారు. ఏ కొద్దిమందో మిస్ అయ్యి ఉంటారు. అద్భుతమైన పద్ధతిలో మళ్లీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే, మనం తెలంగాణ సైనికులం. తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆకలికి అటుకులు బుక్కి పనిచేశాం. జైళ్లకు పోయి పనిచేశాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సాధించి పెట్టినం. పదేండ్లు ఏ వర్గానికీ పక్షపాతం లేకుండా, కులం, మతం విచక్షణ లేకుండా అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా, కంటిపాపలా కాపాడుకున్నాం. రేపు మళ్లీ భవిష్యత్తు మనదే. అందరూ ఎవరి స్థాయిలో వాళ్లు పనిచేయండి.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయండి. సర్వేల ప్రకారం 8 నుంచి 12 స్థానాల మధ్య మన ఎంపీలు గెలవబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మళ్లీ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతది. శక్తివంచనా లేకుండా మన పార్టీ ఎంపీలను గెలిపించండి. బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగితే, పార్టీ తరపున కేసులు కొట్లాడటానికి పార్టీ లీగల్సెల్కు రూ.10 కోట్ల నిధులు కేటాయించాను. నాయకులకు నెంబర్లు కూడా ఇచ్చాం. వెంటనే పార్టీ రియాక్ట్ అవుతుంది.
కేసీఆర్ రియాక్ట్ అవుతాడు. మరీ దాడులు తీక్షణంగా ఉంటే కేసీఆరే గద్దలెక్క వాలుతాడు. కాపాడుకుంటాడు. నాయకులు కొంత అటు..ఇటుగా ఉన్నారు. కానీ, కార్యకర్తలు ఉత్సాహంగా, ధైర్యంగా, మొండిగా ఉన్నారు. మీ కదలికలు నాకు కనిపిస్తున్నాయి. కార్యకర్తలు అలానే ఉండండి. తెలంగాణపై మన బాధ్యతలు తీరలేదు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వామ్యంగా ఉంటారు. మంచి భవిష్యత్తు పార్టీకి ఉంటుంది. ఎవరూ కూడా అసంతృప్తికి గురికాకుండా పనిచేయండి. బంగారు తెలంగాణ సాధిద్దాం. అందరికీ శుభాకాంక్షలు.
జవాబు: బాధ్యత మీకు కొత్తగా దొరికింది. సీఎం ఇప్పటికైనా మంచిగా, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లర, మల్లర అపవాదులు పెట్టే పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు మం చి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకోండి. ప్రభుత్వానికి శుభం కలగాలని కోరుకుంటున్నాను.
జవాబు: డాక్టర్ మరో ఆరు నెలలు చేతికర్ర వాడాలని సూచించారు. మరోసారి పడిపోకుండా సపోర్టింగ్ కోసం వాడమన్నారు. వాడుతున్నాను. హిప్ రీప్లేస్ చేశారు. సర్జరీ చేసినచోట అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది.
జవాబు: అలాంటిది నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రాసెస్లోనే కావాలి. ప్రజల నుంచి కావాలి. పార్టీ నాయకుల నుంచి కావాలి. లేదంటే అది శాశ్వతంగా నిలబడదు.